Header Banner

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

  Wed Jun 04, 2025 10:49        Politics

ఏపీలో రోడ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఈ క్రమంలో అనంతపురం నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ప్లాన్ చేశారు.. కానీ అడుగులు ముందుకుపడలేదు. కేంద్రం తాజాగా అనంతపురం నుంచి గుంటూరు వరకు నేషనల్ హైవే-544D విస్తరించాలని నిర్ణయించింది. 398.8 కి.మీ. రోడ్డును 288.8 కి.మీ. నాలుగు వరుసలుగా మారుస్తున్నారు.. మధ్యలో 110 కి.మీ. మాత్రం రెండు వరుసలుగానే ఉంటుంది. ఈ హైవేతో రాయలసీమకు అమరావతి మధ్య కనెక్టివిటీ పెరగనుంది.

అనంతపురం నుంచి ముచ్చుకోట మీదుగా బుగ్గ వరకు 69 కిలోమీటర్ల రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించడానికి రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. బుగ్గ నుంచి కైప మీదుగా గిద్దలూరు వరకు ప్రస్తుతం రెండు వరుసలు 135 కి.మీ. రోడ్డు ఉంది.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!


ఇప్పుడు ఈ రోడ్డును నాలుగు లైన్లుగా మార్చనున్నారు. ఈ రూట్‌లో 15 కి.మీ. అటవీ ప్రాంతం మీదుగా ఉంది. ఈ రోడ్డును కూడా నాలుగు వరుసలుగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ పనులకు సంబంధించి భూసేకరణ కూడా చేస్తున్నారు. 2020లో గిద్దలూరు నుంచి వినుకొండ వరకు 110 కి.మీ. రహదారిని రెండు వరుసలుగా పూర్తి చేశారు.

వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.8 కి.మీ. రోడ్డును నాలుగు వరుసలుగా మార్చడానికి మోర్త్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డుకు మూడు జిల్లాల్లో భూసేకరణ కోసం సర్వే చేస్తుండగా.. రూ.2,605 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు అనంతపురం - గుంటూరు హైవేను నాలుగు వరుసలుగా విస్తరిస్తుండగా.. 110 కిలోమీటర్లు రెండు లైన్లుగా వదిలేయకూడదని భావించారు.. అందుకే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అనంతపురం- గుంటూరు హైవే మొత్తం నాలుగు లైన్లుగా ఉండాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఈ గుంటూరు- అనంతపురం హైవే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఆయా జిల్లాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు కీలకంగా మారనుంది. ఈ హైవేలో గుంటూరు, వినుకొండ, త్రిపురాంతకం మీదుగా కుంట వరకు వెళ్లి.. అక్కడి నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు. 544డిని పూర్తిగా నాలుగు లైన్లుగా చేస్తే.. ఈ హైవే నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NationalHighway #FourLaneHighway #APDevelopment #SrisailamHighway #InfrastructureBoost